Thursday 3 April 2014

MARADU LOKAM---FARMER

ఆయన తలెత్తి ఆకాశం వంక చూస్తున్నాడు.

ఆయన తండ్రీ, తాత కూడా అలాగే చూసేవాళ్ళు. ఆ చూపు వెనుక వుండే దుఃఖం, ఆవేదన చాలామందికి తెలీదు. తెల్సుకునేంత ఓపిక, జ్ఞానం, కూడా లేదు.

ప్రాణాన్ని మొక్కగా నాటి, రక్తాన్ని నీరుగా పోసి పెంచుతున్న పొలం నీళ్ళు లేక ఎండిపోతుంది. ఆకాశంలో మబ్బుల్లేవు. భూమిలో వెయ్యి అడుగులు పోయినా నీరు లేదు. పోనీ నీటిని తోడటానికి మోటార్ కి కరెంట్ లేదు. ప్రపంచానికే అన్నం పెట్టే రైతు ప్రాణం అలా గాల్లో దీపంలా రెపరెపా కొట్టుకుంటుంది.

రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర రాదు. బియ్యం, పప్పులూ కొనుక్కునే వాడికి ధరలు అందుబాటులో వుండవు. పండించిన వాడూ, వినియోగించే వాడి మధ్య వుండే 'పిశాచగణం' మాత్రం రక్తం త్రాగి నిరంతరం బలుస్తూనే వుంటాయి.

రెండు రోజుల తర్వాత...

జిల్లా ఎడిషన్ లో మారుమూల పేజీలో రెండులైన్ల వార్త పడింది.

"అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య..."

జనం, సమాజం పెద్దగా పట్టించుకోలేదు. అదేం పెద్ద విషయమేం కాదు కదా! రోజూ ఎక్కడో ఒకచోట రైతు చస్తూనే వుంటాడు? ఎందుకు చస్తున్నాడు? అని విశ్లేషించేంత తీరిక ప్రభుత్వాలకూ, జనాలకూ లేదు. ఎవరి బిజీ వాళ్ళది.

ఇరవై వేల కోట్లు దోచుకున్న రాజకీయ నాయకుడికి బెయిల్ దొరుకుతుందా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అది కాకపోతే రేపులు, మర్డర్లు, సిన్మా రంకు పురాణాలు వుండనే వున్నాయి...

"ధూ... దీనెమ్మ సమాజం చెడిపోతుంది..." అనుకునేవాడే ప్రతోడూ. సమాజం అంటే ఏమిటి? నేను తప్ప ఇతరులన్నమాట...

No comments:

Post a Comment