Showing posts with label ys jagan party members. Show all posts
Showing posts with label ys jagan party members. Show all posts

Monday, 14 April 2014

jagan వారసత్వ రాజకీయాలు:


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో పలు రాజకీయ కుటుంబాలకు ప్రాముఖ్యత లభించింది

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సీటు దర్మాన కృష్ణదాస్ కు, శ్రీకాకుళం సీటు ధర్మాన ప్రసాదరావుకు కేటాయించారు.
బొబ్బిలి అసెంబ్లీ సీటుకు సుజయ రంగారావు తిరిగి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు బేబి నాయన లోక్ సభకు పోటీచేస్తారు.
విశాఖపట్నం నుంచి లోక్ సభకు విజయమ్మ పోటీచేస్తుండగా, ఆయన కుమారుడు పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పోటీచేయబోతున్నారు.

వారి కుటుంబానికి చెందిన అవినాశ్ రెడ్డి కడప లోక్ సభ కు పోటీలో ఉన్నారు.జగన్ చిన్నాన్న సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి లోక్ సభ లో బరిలో దిగుతున్నారు.సుబ్బారెడ్డి బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ లో ఉన్నారు.

అద్దంకి లో గొట్టిపాటి రవికుమార్ పోటీచేస్తుండగా, ఆయన సోదరుడు కుమారుడు భరత్ కు పర్చూరు కేటాయించారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీచేస్తుండగా, చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి పోటీచేస్తున్నారు.మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డి ఆత్మకూరు నుంచి రంగంలో ఉన్నారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి అసెంబ్లీకి పోటీచేస్తుంటే, ఆయన కుమారుడు మిదున్ రెడ్డి రాజంపేట లోక్ సభకు పోటీచేస్తున్నారు.మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రతాపరెడ్డి, గుంతకల్ నుంచి వెంకట్రామిరెడ్డి రంగంలో ఉన్నారు.వీరు ముగ్గురు సోదరులు కావడం విశేషం.భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీచేస్తుండగా,ఆయన భార్య శోభ నాగిరెడ్డి ఆళ్ల గడ్డ నుంచి పోటీచేస్తున్నారు.