Monday 29 December 2014

DEAR FRIEND.......

ఒక 15ఏళ్ల అబ్బాయి ప్రతీ
రోజు సముద్రం ఒడ్డున నిలబడి
సముద్రాన్ని చూస్తూ ఉండేవాడు....
.
.
.
.
.
తన ప్రాణ స్నేహితుడిని ఆ సముద్రంలో
ఏర్పడిన సునామీ లో కోల్పోయాడు....
అందుకే ప్రతీరోజు ఆ
సముద్రం ఒడ్డున నిలబడి తన
స్నేహితుడిని తలచుకుని
బాధపడుతుండేవాడు .... ప్రతీసారి
సముద్రపు అలలు ఎగిసి పడి వచ్చి
ఒడ్డున నిలబడి ఉన్న ఆ అబ్బాయి
పాదాలను తాకేవి....
.
.
.
.
ఆ అబ్బాయి ఏడుస్తూ..... "
నువ్వు ఎన్నిసార్లు నా
కాళ్లు పట్టుకున్నా....
నేను మాత్రం నిన్ను ఎన్నటికి
క్షమించను....."

GREAT DAD

మా పక్కింటి అమ్మాయి పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఏమైందో వాడిన వసంతంలా చిన్న బోయి ఉంది. గాలిలో గాలిపటంలా ఎప్పుడూ ఎగురు తూ నవ్వుతూ ఉండే పిల్ల ఎగరకపోతే ఎగరకపోయే, రెక్కలు విరిగిన పక్షిలా గోడకలా జారగిలబడి కూర్చో డమేమిటి? అలుకూ పలుకూ లేకుండా ఆ మూగనో మేమిటి? అర్థం కావడంలేదు. ఇంతలో ఆ అమ్మాయి చిన్నగా ఏడుస్తూ 'నాన్నా! నేను భరించలేను. ఆర్నెల్లుగా నేనెంత క్షోభ అనుభవిస్తున్నానో మీకు తెలీదు. ప్రతి చిన్న విషయానికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. ప్రతి పైసాకీ లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కదానికీ యుద్ధం చేయాలి. అయింది చాలు. అనుభవించింది చాలు. నన్నొదిలెయ్యండి. నా చావేదో నేను చస్తాను..' అంటోంది.
తండ్రి కూతురి చెయ్యిపట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్లాడు. మేము మా వరండాలో కూర్చుంటే వాళ్ల కిచెన్ కన్పిస్తుంది. మంట పెద్దది చేశాడు... కంగారు పడ్డాను. ఆయన చాలా కూల్‌గా మూడు గిన్నెలు తీసు కుని వాటి నిండా నీళ్లుపోసి మూడు బర్నర్ల మీదా పెట్టాడు. నీళ్లు మరుగుతున్నాయి. ఒక గిన్నెలో పొటాటోలు, మరో గిన్నెలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. పది నిమిషాల తర్వాత బర్నర్లు ఆపు చేసి మూడు గిన్నెలూ కిందకు దింపాడు. పొటాటోలు, కోడి గుడ్లు తీసి ఒక పళ్లెంలో పెట్టాడు. మూడో గిన్నెలోని కాఫీ ని కప్పులో పోశాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని 'ఈ మూడు ఏమిటో ఇప్పుడు చెప్పు?' అని అడిగాడు.
కూతురు 'ఏముంది? పొటాటోస్, ఎగ్స్, కాఫీ' అంది. అంత తొందరెందుకు వాటిని చేతుల్లోకి తీసుకు ని చూడు' అన్నాడు తండ్రి. ఆ అమ్మాయి పొటాటోను చేతుల్లోకి తీసుకోబోతుండగానే అది మెత్తగా నుజ్జుయి కిందపడింది. తర్వాత కోడిగుడ్డును బ్రేక్ చెయ్యమన్నా డు. కూతురు గుడ్డును పగలకొట్టి పైనున్న పెంకంతా తీసేసింది. లోపల ఉడికిన గుడ్డు గట్టిగా ఉంది. తండ్రి వైపు చూసింది. 'ఇంకోటి మిగిలి ఉంది. దాని సంగతేమిటో కూడా చూడు' అన్నాడు.
ఆ అమ్మాయి కాఫీ కప్పు దగ్గరకు తీసుకుంది. నురుగులు కక్కుతున్న కాఫీ మీద నుంచి వస్తున్న వెచ్చటి పరిమళం ఉల్లాసాన్ని చ్చింది. నాన్నను కాఫీ సగం తాగి మిగిలింది తనకు ఇమ్మంది. 'వద్దులే నువ్వేతాగు' అన్నాడు. ‘ఏమిటి దీని అర్థం? ఫ్లీజ్ చెప్పు నాన్నా’ అని బతిమాలింది. 'పొటాటో లు, గుడ్లు, కాఫీ గింజలు - మూడు ఒకే సమయంలో ఒకే రకమైన యాడ్వర్సిటీని ఎదుర్కున్నాయి. మరిగే నీళ్లలో అవి ఒంటిని కాల్చుకు న్నాయి. కానీ, ఒక్కోటి ఒక్కోరకంగా మారిపోయాయి. అప్పటి వరకూ గట్టిగా ఉన్న దుంపలు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక మెత్తగా తయారయ్యాయి.
గుడ్లయి తే చాలా డెలికేట్‌గా హాండిల్ చెయ్యడానికే కష్టంగా ఉండేవి. లోపలంతా ద్రవం. ఏ మాత్రం బ్రేక్ అయినా మొత్తం నేలపాలవుతుందని భయం. అలాంటివి మరిగే నీళ్లల్లో ఉడికి ఉడికీ గట్టిపడిపోయాయి. గుడ్ల లోపలి ద్రవమంతా ఘనీభవించింది. కానీ, కాఫీ గింజలో.. నీళ్లలో మరుగుతూనే నీటి రంగునీరుచినీ స్వరూపాన్నీ స్వభావాన్నీ మార్చేశాయి. పరిసరాల్ని పరిమళభరితం చేశాయి. ఇప్పుడు నువ్వాలోచించుకో. పొటాటో లాగా మెత్తబడి నిస్పృహలోకి వెళ్తావో, గుడ్డులాగా థిక్ స్కిన్డ్ అయిపోయి మనసును రాయి చేసుకుంటావో? లేక, నీ వ్యక్తిత్వంతో అందరిన్నీ గెలిచి కష్టాలను అధిగమించి మంచి కాఫీలాగా పరిమిళిస్తావో!
మా పక్కింటి అమ్మాయి నాన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చెంపలోకు చేర్చుకుంది. మనసుకు హాయిగా ఉంది! స్వీట్ డాడీ! నాటీ చైల్ట్!- ప్రయాగ రామకృష్ణ?

Sunday 28 December 2014

దోచుకోని వాడు ఎవరు?

తినే ప్రతీ గింజ మీదా మన పేరు రాసి ఉంటుందని ఒకప్పుడు నమ్మేవాళ్లం..
ఇప్పుడు ఏ కోశానా అలాంటి నమ్మకాలు ఎవరికీ లేవు... "లాక్కుని తినే ప్రతీ గింజా మనదే" నైజం అలవడిపోయింది.
కరప్షన్ కరప్షన్ అని కాకుల్లా అరస్తున్నాం గానీ.. ఎవరి స్థాయిలో వాళ్లం కరప్ట్ అవుతూనే ఉన్నాం...
పైసా పని చేసి వంద రూపాయలు ఆశించడం కరప్టెడ్ మైండ్‌సైట్ క్రిందకు రాక "బ్రతకనేర్చడం క్రిందకు ఎలా వస్తుందో" నాకు ఇప్పటికీ అర్థం కాదు.
ప్రతోడూ ప్రతోడీనీ దోచుకునే వాడే అయిన కాడికి.. ఇలాంటి సమాజంలో అమెరికా పని మనిషి శ్రమ దోపిడీ అంతర్జాతీయ సమస్య అవుతుంది... కొన్ని కాలం, ఖర్మం కలిసొచ్చి ఇలా వెలుగు చూస్తాయి.. కొన్ని గమ్మున సాగిపోతుంటాయి.
ఎవరి దోపిడీ వారికి అర్థం కాదు... దోచుకోబడే వాడి నీలుగుళ్లల్లో సమాధైపోవడం తప్పించి!!
ఆటో వాడు మీటర్ వేయనంటాడు.... సినిమా థియేటర్ వాడు బ్లాక్ టిక్కెట్లు అమ్ముతుంటాడు... ఆధార్ సెంటర్ వాడు 200 తీసుకుని 10 నిముషాల్లో enroll చేస్తాడు..
ఇవన్నీ మన దృష్టిలో standard మోసాలు.. వీటిని అస్సలు సహించం...
అదే మనం, ఆఫీస్‌కెళ్లి పావలా పని కూడా చేయకుండానే, చాలాసార్లు ఏదో చేసేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తూనే.. ప్యాకేజీలు పెరగట్లేదని చిరాకు ఫేస్‌తో తిరుగుతుంటాం.
-------------------
దోపిడీ పెద్ద అంటు వ్యాధి... ఒకడు దోచుకుంటుంటే రెండో వాడికి బలం వస్తుంది... "వాడేం పనిచేయకపోయినా టాలెంట్ లేకపోయినా వాడికి జీతం పెరుగుతోందీ.." వంటి ఆక్రందనల మాటున... "నాకూ సంస్థను దోచుకునే అవకాశం దక్కట్లేదే" అన్న అక్కసుకి మించి ఏమీ ఉండదు.
ఒక దేశం, సమాజం బాగుండాలంటే ప్రొడక్టవిటీ పెరగాలి, నాణ్యత పెరగాలి, ప్రతీ ఒక్కళ్లూ ఒళ్లొంచి కష్టపడాలి..
కానీ మనం సమాజాన్నీ, సంస్థల్నీ, వ్యవస్థల్నీ నిట్టనిలువునా దోచుకుంటూ... మనవేం తప్పులు లేనట్లు పిల్లుల్లా కళ్లు మూసుకుని బ్రతికేస్తుంటే ఏం మార్పు వస్తుంది?
మన అసంతృప్తికి కారణం మన దోపిడీ నైజమే.. పనిని నమ్ముకుని, నాలుగు ముద్దలు నోట్లో వెళ్లడమే కోరుకునే వాడికి ఎప్పుడూ అసంతృప్తి ఉండదు.
చాలా దోచుకోవాలనుకునీ, చేతికి కాస్త కూడా చిక్కని వాడికే చిక్కించుకోలేకపోయానన్న బాధ నిరంతరం!!
------------------
ఆరణ్యంలో కాకుల రొదల మధ్య రాబందులు మాంస కళేబరాల్ని తన్నుకుపోతున్నట్లు లేదూ!

ఎప్పుడు మారతారు ?

నాగరికత తెలీని రోజుల్లో.. జాతులు, తెగలూ ఉండేవి. భూమి అనేది ఓ సువిశాల ప్రపంచమని తెలీని అజ్ఞానంలో.. తమ తెగలో ఉన్న వంద మంది మాత్రమే తమ వారనీ, మిగతా తెగల వారూ, జాతుల వారూ కొందరు మిత్రులూ, కొందరు శత్రువులు అని భావిస్తూ బ్రతికేవారు.
ఆ తర్వాత ప్రపంచం చాలా పెద్దదని అర్థమైంది. అయినా మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఉండడానికి కొన్ని కట్టుబాట్లతో కులాలూ, మతాలూ వేళ్లూనుకున్నాయి. అలాగే ఇప్పుడు మళ్లీ నాగరికత లేని కాలంలోని తెగలూ, జాతులకూ ప్రతిరూపాలుగా ప్రాంతాలూ వచ్చి చేరుతున్నాయి. ఏ కులం, మతం, ప్రాంతం అజెండా దానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అజెండా వైపు అందర్నీ లాగడమే "సామాజిక బాధ్యత"గా అందర్నీ బోధించబడుతోంది.
ఇదంతా చూస్తుంటే.. మనిషి ఎక్కడో ఏ మారుమూల తెగలో కట్టుబట్టల్లేకుండా అనాగరికంగా అదే ప్రపంచమని భ్రమించి బ్రతికేసిన గతం మళ్లీ ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు అన్పించట్లేదా?
మనిషి ఆలోచన విస్తృతం కావాలి.. తానొక సాటి మనిషినని ఫీలవ్వాలి, ఏ కులపో, మతపో, ప్రాంతపో ప్రతినిధిగా ఎస్టాబ్లిష్ అవడానికి ప్రయత్నిస్తే ఆ మనిషి అంతటితోనే సమాధి అయిపోయిట్లు లెక్క.
ఇప్పుడందరూ గొప్పగా పేర్ల చివర తగిలించుకుంటున్నట్లు 20 ఏళ్ల నుండి నేనూ నా పేరు చివర్న చౌదరి అని తగిలించుకోవచ్చు. అలా తగిలించుకుంటే ఏమొస్తుంది? ఈరోజు చౌదరి అయినా, రెడ్డి అయినా, రాజు అయినా, చారి, గౌడ, నాయక్ వంటి ఏ కులపు పేర్లయినా అసలు ఏం ఉద్ధరిస్తాయి మనల్ని? "మనిషిగా సంకుచితంగా బ్రతికేస్తున్నాం" అని మనం అందరికీ మన గురించి చిన్నచూపు కలిగించడానికి తప్పించి కులం పేర్లు ఎందుకూ పనికిరావు. కులం ద్వారా పౌరుషాలు రావు.. కులం ద్వారా రాజసం రాదు.. కులం ద్వారా దుర్గుణాలు రావు.. మన జీవితంలోకి ఏదొచ్చినా మన ఆలోచనల ద్వారానే, వ్యక్తిత్వం ద్వారానే!!
ఈ మధ్య చాలామంది Facebook ప్రొఫైళ్లలో "తెలంగాణ", "ఆంధ్ర" వంటి పేర్లు తోకలుగా కన్పిస్తున్నాయి. అసలు ఏమైంది మీకందరికీ? నిన్న మొన్నటి వరకూ లేని సంకుచిత భావాలు ఇప్పుడెందుకు మొగ్గతొడుగుతున్నాయి?
అమ్మ జన్మనిచ్చింది కాబట్టి.. అదృష్టం ఉండబట్టి ఈ భూమ్మీద పుట్టగలిగాం. పుట్టేటప్పుడు "అప్పటికే ఈ భూమ్మీద ఉన్న వాళ్లందరూ మనుషులు కాదు.. నేనొక్కడినే మనిషిని" అని అనుకునే హక్కు మనకి లేదు. మరి పెరిగి పెద్దయ్యాక ఏముందని నీ చేతిలో "మిగతా సమాజం ఏదీ నాకు వద్దు.. నాకు నా వాళ్లే కావాలి" అని గిరిగీసుకు బ్రతకడానికి సిగ్గేయట్లేదూ?
అవును.. ప్రపంచంలో సంకుచిత మనస్థత్వాల వారు చాలామందే ఉన్నారు. వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు సంకుచితంగా మారతావా?
ఈ భూమ్మీద ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు.. ఎవరి టాలెంట్ వాడిది.. ఎవడి జీవితం వాడిది.. కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో, దేశం పేరు చెప్పో "నువ్వు బ్రతకడానికి వీల్లేదని" అనడానికి అస్సలు నువ్వెవరు? ఒక్కసారి ఆలోచించు?
చివరిగా ఒక్కమాట.. నలుగురినీ కలుపుకుపోయి బ్రతికేది సమాజం.. నలుగురినీ తరిమేసి ఒక్కడివే పాతుకుపోవాలని చూసేది శ్మశానం!!
సమాజం కావాలో, శ్మశానం కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.


Thursday 25 September 2014

only for GENTS

అచ్చంగా మగవారికి మాత్రమె!


(ఇంకో 'మాత్రమే' ఏమిటంటే 'ఇది' కేవలం అనువాదం మాత్రమే!)
భార్య: ఏవిటి ఆఫీసు నుంచి పెందలాడే దిగడ్డారు?
భర్త: మా బాసుకి నా మీద కోపం వచ్చింది. గో టు హెల్ అన్నాడు. అంతే! ఇంటికొచ్చేసా!
డాక్టర్: మీ తలనొప్పి ఏమైంది ?
పేషెంటు: నిన్ననే పుట్టింటికి వెళ్ళింది.

మనిషికి నాలుగింటితో అసలు  తృప్తి అనేదే  వుండదు ఒకటి సెల్ ఫోన్, రెండోది కారు, మూడోది టీవీ, నాలుగోది భార్య
ఎందుకంటె -
ఎప్పటికప్పుడు వాటిని మించిన బెటర్ మోడళ్ళు మార్కెట్లోకి వస్తుంటాయి కాబట్టి.
విస్కీ కనుక్కున్నవాడు ఎవడో కానీ దానిలో ఒక సుగుణం వుంది. ఒక 'డబుల్' కడుపులో పడగానే సింగిల్ గా వున్న భావన కలుగుతుంది.
ఆడది కళ్ళు  మూసుకుంటే ఆమె మనసుపడే మనిషి కళ్ళల్లో మెదులుతాడు. అదే మగవాడు కళ్ళు మూసుకుంటే అతగాడు కోరుకునేవారి మొహాలతో ఏకంగా ఒక  స్లైడ్ షో మొదలవుతుంది.
ఒక మగవాడి టీ షర్ట్ మీద ఇలా రాసుంది:
ఆడవాళ్ళందరూ రాక్షసులు. కానీ మా  ఆవిడ మాత్రం రాణి (చిన్న అక్షరాలలో) ఆ రాక్షసులందరికీ. 
'ఆడవాళ్లకి చెప్పులు అంటే ఎందుకంత మోజు ?
ఎందుకంటె, వాళ్ళు  ఎంతగా లావెక్కినా చెప్పులు మాత్రం సైజు మార్చక్కరలేకుండా కరెక్టుగా సరిపోతాయి'
'ఆడవాళ్ళు సరిగా కారు నడపలేరు అనే అపప్రధ వుంది.  నిజమేనా?
'వాళ్ళు మాత్రం ఏంచేస్తారు. కార్లలో ఎటూ చూసినా అద్దాలేనాయే! ఇక వారికి  డ్రైవింగ్ మీద ధ్యాస నిలబడాలంటే కష్టం  కదా!'  
'ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకబోతున్న ఆడమనిషిని కాపాడడం ఎలా?
'దగ్గరలో వున్న చీరెల షాపులో తొంభయ్  శాతం సేల్ నడుస్తోందని గట్టిగా అరిచి చెప్పాలి'
'మగవాళ్ళందరూ ఒకే మోస్తరు. ఏం తేడా లేదు' అనే స్త్రీ ఎవరయి వుంటుంది?'
'మగవాళ్ళ గుంపులో తప్పిపోయిన మొగుడ్ని వెతుక్కునే చైనా అమ్మడు అయివుంటుంది'
కొందరు మగవాళ్ళు బ్రహ్మచారులుగా వుండిపోయి ప్రపంచంలో  జరిగే వింతలన్నింటినీ గమనిస్తుంటారు.  మరి కొందరు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో జరిగేవాటిని వింతగా చూస్తుంటారు.
'ఏమో అనుకుంటాము కానీ గురూ గారూ ఈ ఆడాళ్ళున్నారే, మహా జాదూలు గురూ గారు?'
'ఎందుకలా అనిపించింది'
'మా ఆవిడతో ఏదైనా మాటలు మొదలు పెడతానా! విషయం ఏదైనా కానీండి. నాకు తెలీకుండానే దాన్ని వాదులాటలోకి మార్చేస్తుంది'

'మగవారితో పోలిస్తే ఆడవాళ్ళు మంచి, చక్కటి, ఆహ్లాదకరమైన, జీవితాన్ని చాలాకాలం అనుభవించగలరు ఎందుకంటారు.?'
'ఎందుకేమిటి మీ మొహం నా శ్రాద్ధం - వారికి 'భార్యలు' వుండరు కాబట్టి'

A Sreenu Vaitla Film : ఆగడు Fans Please Don't Read

A Sreenu Vaitla Film : ఆగడు  ...Fans Please Don't Read


ప్రజలారా..  తెలుగువారిగా మనందరికీ తెలుసు మహేష్ బాబు కి మేకప్ అక్కర్లేదనీ, శ్రీనువైట్ల సినిమా కి స్టోరీ అక్కర్లేదనీ, మనం కామెడీ  మాత్రం మనం కనెక్ట్ అయిపోతామనీ. కానీ నెత్తి మీద పిడుగు పడినప్పుడూ,
పాము కాటేసినప్పుడూ, గేదె పేడేసినప్పుడూ ఒకటే మంత్రం వేస్తానంటే  జుత్తు కాలిపోయి, నోట్లోంచి నురగలొచ్చేసి, సీన్ కంపు కొడతాది... సినిమా తీసినోళ్ళకీ, చూసినోళ్లకీ కూడా.! ఆ తర్వాత ఇదిగో... ఇట్టాంటి పోస్టులు చదవాల్సిన కర్మ పడతాది మీకు.

చిన్న ఊక దంపుడు కార్యక్రమంః

గుడుంబా శంకర్ తో మొదలయ్యి ఫెయిలయిన ఒక స్టోరీ టెంప్లేట్ నీ, మార్పులు చేసి బంపర్ హిట్ లు కొట్టిన ఘనత శ్రీమాన్ శ్రీను వైట్ల దే. అది ఎలాంటి ఘనతంటే
ప్రస్తుతం తెలుగు సినిమాలకి డైరెక్టర్లు వేరై ఉండొచ్చు, హీరోలు మారి ఉండొచ్చు, హీరోయిన్లు కామన్ అయి ఉండొచ్చు, రైటర్లకీ, డైరెక్టర్లకీ పడకపోయి ఉండొచ్చు, విడిపోయి విడివిడి గా దాడి చెయ్యొచ్చు కానీ "ఆవు వ్యాసం" లాగా అదే టెంప్లేట్.
ఈ ఎదవ ఫార్ములా పుణ్యమా అనీ తెలుగు హీరోలు కమెడియన్లు గానూ, హీరోయిన్లు , ఐటెం నంబర్లు గానూ, విలన్లు బఫూన్లు గానూ, కమెడియన్లు హీరోలుగానూ రూపాంతరం చెందారు. హరిశ్చంద్రుడి జీవిత చరిత్రైనా, సిపాయిల తిరుగుబాటు కధ అయినా ఈ టెంప్లేట్ లో పెట్టాక
ఒకలాగే తయారవుతాయి.
ఉదాహరణకి రామాయణాన్ని సినిమాగా తీయమని వీళ్ల చేతిలో పెడితే ఈ కమర్షియల్ టెంప్లేట్ లో పెట్టి, అవసరం అనుకుంటే కామెడీ బిట్లు హిందీ సినిమాల నుండీ, కాన్సెప్ట్  కొరియా సినిమా నుండీ, ఫైట్లు హాలీవుడ్ సినిమా నుండీ లేపేసి కలిపేసి పులిహోర చేసి హిట్ చేసెయ్యగలరు.

సపోజ్... పర్ సపోజ్... ఇదే శ్రీనుగారికి మహేష్ బాబుని రాముడుగా పెట్టి రామాయణాన్ని తీయమంటే......... అది ఈ ఆవు వ్యాసం టెంప్లేట్ లో ఇల్లా అవుతుంది.

(గమనికః ఇదో భయంకరమైన, మా చెడ్డ ఊహ మాత్రమే. నాకు రామాయణం అంటే ఇష్టం, గౌరవం)

సినిమా బిగినింగ్ లో బాల రాముడు-దశరధుడి మీద రెండు సెంటిమెంట్ సీన్లు, అడవి లో ఫస్ట్ ఫైట్, ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తొట్టిగ్యాంగ్ ఫ్రెండ్స్ తో కామెడీ, సీత తో పరిచయం-డ్యూయెట్, సూర్పణఖ తో లక్ష్మణుడి ఐటెం సాంగ్.(క్షమించాలి)
ఇంటర్వెల్ బ్యాంగ్ కి రావణాసురిడి తో చాలెంజ్, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ (దీనికి లాజిక్కులతో పని లే..!!) బ్రహ్మానందాన్ని బకరాని చేసి, ఆ అడ్డెట్టుకొని రావణాసురిడింట్లో మకాం. విలన్ గ్యాంగ్ ని మొత్తాన్నీ వెధవల్ని చేసి, ఇంద్రజిత్ తో ఫైటింగ్ చేసీ చంపేసీ,చివరాఖర్న రావణాసురిడి లో మార్పు తెచ్చి, శాంతిని నెలకొల్పి సీతని విడిపించుకొని శుభం కార్డ్ వేసి, టికెట్ రేటు వందా, ధియేటర్లు వెయ్యీ పెంచి ఫస్ట్ వీక్ కలెక్షన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తారు. ఈ వారం రోజులూ  టీవీ నైన్ లో లైవ్ షో దగ్గర నుండీ దూరదర్శన్ లో పందుల పెంపకం
ప్రోగ్రాం దాకా గెస్ట్లు గా వీళ్ళే ఉంటారు. ఏ రియాలిటీ షో జూసినా ఏమున్నది గర్వకారణం..  హిట్టయిన సీరియల్ ఆర్టిస్టులూ, ఫ్లాపయిన సినిమా బృందాల ఓవరాక్షన్లూ తప్ప. ఆ సినిమాని ఏ  పండక్కో టీవీ లో వేసే లోగా, యూట్యూబ్ లో పెట్టే లోగా బస్సు యాత్రా, నా వల్లకాడు యాత్రానూ..!!

అసలు సంగతి వదిలేశాను. కీలక మైన పంచ్ డైలాగులు. ఇప్పుడు SuperStar in & as శ్రీరాముడు గా అద్దిరి పోయే పంచ్ డైలాగ్స్.
[మరే.... పంచ్ డైలాగుల ప్రభావం జనాల మీద గట్టి గానే ఉంది]

మధ్య మధ్య లో ముక్కు ఎగబీలుస్తూ...
కీచు గొంతుతో.... రవణా...(రావణా) ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.... బాణం దిగిందా లేదా ?

రవణా..... మధురై ని కాపాడ్డానికి మీనాక్షమ్మ ఉందీ.. నా సీత ని కాపాడుకోడానికి నేనున్నాను

బాణం తీశాకా.. బ్లైండ్ గా వేసెయ్యటమే (నీ దూకుడూ... సా...టెవ్వడూ... )

విభీషణుడు హ్యాండిచ్చాడంటగా.. మండోదరి హ్యాపీసా? యుద్ధా.......నికొస్తున్నారంటగా? గెలుపూనాదే సీతా నాదే... ఎప్పుడిస్తున్నావ్ సీతనీ ఆ .....?

పడుకున్న పులినీ, వనవాసం చేసుకుంటున్న నన్నూ కెలికితే..... వేటే

దూకుడు లేకపోతే ఈ రాముడుకీ కీ ఆ రావణుడికీ తేడా ఏం ఉంటదీ?

నేను యుద్దానికొస్తే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి

బాణాలకి బెదరని బాడీ రా నాదీ..!

మా నాన్నెప్పుడూ ఒకటి చెప్తుండేవాడు "మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మూకుడు లో వేపుడైపోద్ది బతుకూ.. అని"

విల్లు చూడాలనుకో.... తప్పులేదు.. కానీ బాణాన్ని చూడాలనుకోకు చచ్చిపోతావ్.

మహేశ్ః రావణాసురుడు గారు.. మీరు చేసింది తప్పు.
రావణాసురుడుః తెలుసయ్యా.. కానీ మానలేకపోతున్నాను. పూర్వం పది డబ్బాలు వాడేవాడిని.ఇప్పుడు తగ్గించా.
మహేశ్ః నేను మాట్లాడేది మెంతోప్లస్ గురించి కాదండీ.
రావణాసురుడుః కొంపదీసి సీత గురించా? చూడు రామా... నువ్ ఇప్పుడొచ్చావ్.. నేను ఆల్రెడీ జటాయువు రెక్కలు తెగ్గొట్టోచ్చాను. అది తెలిస్తే మీ వాళ్ళకి హార్ట్ ఎటాక్ వస్తుందీ.. రామసేతు దగ్గర రెడీగా ఉండు

నేను ఈ లంకా నగరం చేత &$*$(@% కొచ్చాను.

ఈళ్ళేంటీ.. ఇంగ్లీష్ మాట్లాడ్డం ఏంటీ అనుకుంటున్నారా??  "సినిమాల్జూట్టం లేదేటీ??"

ఇంకేముందీ... పంచ్ డైలాగులకి సినిమా  హిట్టు. మనోభావాలు గాయపడినందుకు ధియేటర్ బయట ధర్నా చేసిన ప్రజానీకం. రెండో వారం ఊపందుకున్న కలెక్షన్లు. సినిమా సూపర్ డూపర్ హిట్టు.
***********************************************************************************************************************

ఏదో రాద్దామని మొదలెట్టి ఇంకేదేదో రాసినట్టున్నా... ఫ్రస్ట్రేషన్..  ఫ్రస్ట్రేషన్..!!! ఇంట్లో మా ఆవిడ ప్రేమ పూర్వక హింస , ఆఫీసులో మా డామేజరు అధికారిక హింస. రిలాక్స్ అవ్వడానికి  సినిమా కెళ్తే  వినోదాత్మక హింస.
పొద్దున్న తొమ్మిది నుండి రాత్రి ఎనిమిదింటిదాకా ఆఫీసు లో అఘోరించి, బజారు చేసీ, ఇంటి కొచ్చి, అంట్లు తోమి, వంట చేసీ (కంట్రోల్...కంట్రోల్... అబ్బెబ్బే అదేం లేదు...అంతా తూచ్..)  పదింటికి   ఐదొందలు పెట్టి టికెట్ట్ కొనీ "ఆగడు" సినిమాకెళ్ళి మహేష్ బాబు ఎంట్రన్స్ కి విజిలేసి
అలసిపోయిన పాపానికి ఇదా ప్రతిఫలం???
ఈ సినిమాకి రివ్యూ రాసే ఓపిక మాత్రం నాకు లేదు బగమంతుడా..!!  ఓ ఉత్తరం ముక్క మాత్రం రాస్తున్యా.
నాకు చాలా డౌట్లు ఉన్నాయ్... ఐ వాంట్ ఆన్సర్స్ రైట్ నౌ.

గౌరవనీయులైన శ్రీను వైట్ల సారు కీ,

మీ కొత్త సినిమా "ఆగడు" బాధితుడు పిచ్చాసుపత్రి నుండి అశ్రు నయనాలతో , రక్త కర్ణాలతో, శిరోభారం తో, స్వహస్తాలతో  రాస్తున్న విన్నపం ఏమనగా,

అయ్యా... గత కొన్నేళ్ళుగా  మీ సినిమాలకి కామెడీ సీన్లు తీశాక స్టోరీ అల్లుకుంటారనిన్నూ, బ్రహ్మానందం లేని మీ సినిమా బాస్మతీ రైస్ లేని బిర్యానీ లాంటిదనిన్నూ సమైక్య వాదులూ, తెలంగాణా వాదులూ మూకుమ్మడి గా ఒప్పుకునే  ఒకే ఒక్క గోప్ప వాస్తవం. సర్వ కధ సమ్మేళనం లాంటి మీ ఏకైక కధ భిన్నత్వం లో ఏకత్వాన్ని ఎలుగెత్తి
చాటుతూ  ఎక్కడ మొదలవ్వుద్దో , ఏడేడ తిరుగుద్దో  ఎవ్వరూ పట్టించుకోరనీ, మీ చేతకాని తనాన్ని క్షమించేసి
హాస్యాన్ని మాత్రం ఆస్వాదించి డైలాగులు నెమరేసుకొంటూ హాలు బయటకొస్తారన్నది జనమెరిగిన సత్యం.



1. సినిమా మొదలవ్వటమే దుమ్ము, ధూళి తో మొదలయ్యింది. అది చూసి  "బెంగుళూర్ లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసీ, మరో వైపు పొగ" అనేసుకొని నేను తెగ ఇదైపోయాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి పోనీ లే  ఔట్ డోర్ షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు అనుకున్నాను. మొదటి పాట కూడా
ధూళి బాంబులు పేలుస్తూ, ఆ దుమ్ము లోనే తీశారు. ఎందుకలగా?? "సినిమా దుమ్ము లేపుతాది" అని చెప్పడమా? లేకా మీ టీం తల విదిలించగా రేగిన మట్టా??


2.అసలు మా గురించి మీరేం అనుకుంటున్నారు??

"అవునండయ్యా.. మా ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ & డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు జనాలకి కావల్సినవన్నీ కొలిచి వాళ్ల టెంప్లేట్ లో మసాలాలు  దట్టించి వదుల్తారు. ఎందుకంటే మా ప్రేక్షకులకి ఇవే కావాల.
మన జనాలున్నారే?? తీసిన సినిమాని మళ్ళీ మళ్ళీ తీసి చూపించినా, హిట్టయిన సినిమాలని మిక్సీ లో వేసి వండేసినా, కామెడీ బాగుంటే కాంప్రమైజ్ అయిపోతారు. ఆ కామెడీ లేక పోతే హారర్ సినిమాలు కూడా చూడరు తింగరి కుంకలు. (నిజమే కదా??)
ఈళ్ళ మొహాలకి హాలీవుడ్ రేంజ్ సినిమాలొద్దు గానీ, హాలీవుడ్ సినిమాలనుండి లేపేసిన సీన్లు,  ఫైట్లూ చాలు.
ఎవడైనా ధైర్యం చేసి "1" లాంటి సినిమాతీస్తే అరాయించుకొనే శక్తి లేదు. మిధునం లాంటి సినిమాలకి ధియేటర్లు దొరికే పరిస్థితి లేదు. చూసే ఓపిక అస్సలు లేదు.  ప్రాసలు రాసే రైటర్లు, తన్నులు తినే బ్రమ్మానందం, ట్రయిలర్లు చూసి ఫేస్బుక్ లో
కొట్టుకు చచ్చే ఫ్యాన్సుండగా మా కేల చింత??"

ఇదేనా మాపై మీ అభిప్రాయం?? అందుకేనా మిగిలిపోయిన పలావునీ, పాచిపోయిన పులిహోరనీ కలిపి పోపెట్టి పార్సిల్ చేసేసి మా ప్రాణాల మీదకి తెచ్చారు??

౩. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న.
సినిమా లో క్యారెక్టర్లన్నీ, ఎవరో తరుముకొస్తున్నట్టూ, పాడైపోయిన లౌడ్ స్పీకర్ మింగినట్టూ హడావిడిగా, హై పిచ్ లో అరుస్తాయెందుకనీ?? దీన్నేనా ఏక్టర్ల భాషలో టైమింగ్ అంటారు??
దూకుడు సినిమా క్లైమాక్స్  లో బ్రహ్మీ చూపించిన ఎనర్జీ కి జనాల రియాక్షన్ బాగుందని ఈ సినిమా మొదటి  నుండీ చూపించాలన్న దురాశే అలా చెయ్యించిందా?? మహేష్ చేత బ్రహ్మీ ని ఇమిటేట్ చేయించినట్టుగా అనిపించలేదా?? అవి డైలాగులు చెప్పినట్టు లేవు దేవరా.... కాకా హోటల్ లో సప్లయిర్ "ఇడ్లీ,వడా,పూరీ,ఉప్మా, పొంగల్, దోసా,పెసరట్,మినపట్," అని గ్యాప్ లేకుండ లిస్ట్ చదివినట్టూ, సాఫ్ట్వేర్ కంపెనీ పేర్లకి అబ్రివేషన్స్ వింటున్నట్టూ ఉన్నాది.  ఒక్క డైలాగన్నా పూర్తిగా చెవులోకెళ్తే మీ నెక్స్ట్ సినిమాకి నాకు ఫ్రీ టెకెట్స్ పంపించి పగదీర్చుకోండి.

4. ప్రాస ఉన్న ప్రతి మాటా పంచ్ డైలాగ్ ఐపోతుందా?? అవసరం ఉన్నా లేకపోయినా రైమింగ్ కోసం రాసి పారేస్తారా?? ఆ రైమింగ్ కోసం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పక్కనెట్టుకొని రాసినట్టూ బొచ్చెడు ఇంగ్లీష్ పదాలు
గ్యాప్ లేకుండా రాసి పొలాల్లో మందుకొట్టినట్టూ మా చెవుల్లోకి పిచికారీ చేశారు. వై దిస్ కొలవెర్రి ఢీ గోవిందా?? బాద్షా
సినిమాని హిట్ చెయ్యలేదని ఇంత పగబడతారా??

5. నేను ఒక శ్రీను వైట్ల  సినిమాకి వెళ్ళీ, ఒక్క సారి కూడా నవ్వకుండా రావడం. ఇదొక రికార్డ్ మాషారూ..!  మా తాత చనిపోయినప్పుడు కూడా అంత సీరియస్ గా లేను నేను.
ఫస్టాఫ్ లో బ్రహ్మీ వచ్చాక నవ్వుదామని వెయిట్ చేశాను. బ్రహ్మీ వచ్చాక సినిమా ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేశాను. బహుశా నాలో హాస్యగ్రంధులు హరించుకుపోయాయేమో..!!

5. ఫస్టాఫ్ గబ్బర్ సింగ్ నీ ( హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్ కాస్టూంస్ తో సహా పోలిక కనిపించేలా) , సెకండ్ హాఫ్ దూకుడునీ కలిపేసి రీమిక్స్ చేసి వదిలేస్తానంటే చేసెయ్యడానికి మేం ఏక్టర్స్ కాదూ.. రిసల్ట్ డిసైడ్ జేసే ఫ్యాక్టర్స్. (ఇదీ పంచ్ డైలాగుల ప్రభావమే)
తమరికి షార్ట్ టైం మెమొరీ లాస్ గానీ ఉందా లేకా మాకుందని మీ ఫీలింగా?? ఈ రోజుల్లో జనాలు చాలా షార్ప్ గా ఉన్నారయా.. సీన్ చూసి ఏ సినిమా నుండి లేపేశారో, ట్యూన్ విని ఏ ఆల్బం కాపీ కొట్టారో ఫేస్బుక్ లో పెట్టి దులిపేస్తున్నారు. అంచేత "నో చెవిలొ పువ్వెట్టింగ్...నో చెవిలొ పువ్వెట్టింగ్"

6.తమన్ బాబు గారి మొబైల్ లో ఇంటర్నెట్ ప్యాకేజ్ వెయ్యించలేదా??  కొట్టెయ్యడానికి కొత్త పాటల్లేక వారు సొంత ట్యూన్స్ ఇచ్చినట్టున్నారు. ఏంది సార్ ఆ పాటలో?? అసలేంటంటున్నాను?? దూకుడు పాటల్నే మళ్ళీ పెట్టుకోవాల్సింది. మిమ్మల్ని ఎవరాపగలరు?? ఇహ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాబా...
పాలరాతి నేల మీద అందమైన అమ్మాయి హై హీల్స్ తో క్యాట్ వాక్ చేసినట్టూ "టిక్కుం..టిక్కుం..ట్రియ్యుం ట్రియ్యుం"

7. ఇందాకే వీడియో లో చూశా. ఆ డైలాగులు అర్ధం చేస్కోడానికి రెండో సారి చూడాలనీ, ఆ పై ఎల్లలు లేని ఎంజాయ్మెంట్ మీదేననీ సెలవిచ్చారు.... అడ్డెడ్డె... అర్ధం చేసుకోడానికి మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఇది క్రిస్టోఫర్ నోలన్ సినిమా కాదు గదా శ్రీను వైట్ల కామెడీ సినిమా.

8.పాపం ప్రకాష్ రాజ్ ఎమోషనల్ స్పీచ్ ని ఏజిటీజ్ గా వాడేసుకుని కమ్మగడతారా? తప్పు కదూ?? పోనీ ఆ డైలాగు అక్కడ విలన్ కి సూటయ్యి ఏడ్చిందా అంటే అదీ లేదు." గిసుంటివి మస్తు జేసినం.  గిదేమన్నా ఫస్ట్ టైమా? నాకు నచ్చకపోతే నెక్స్ట్ సినిమా లో క్యారెక్టర్ ని చేసి కసి దీర్చుకుంటా" నంటారా?? వాకే...!

9. సినిమా మొత్తం అయిపోయాక, చూశాక "సినిమా ఏంటి ఇంత చెత్తగా ఉందీ?" అని మీకు ఎందుకు అనిపించలేదూ అని ప్రశ్నిస్తా ఉన్నా?? సోనూ సూద్ లాంటి విలన్ని పెట్టుకొని,  క్లైమాక్స్ లో బ్రహ్మీ చేత గ్రాఫిక్స్
డాన్సులు చేయించడమేందో.. జనాల్ని నవ్వించీడానికే?? ఆ...హా??


10. కేవలం పంచ్ డైలాగుల కామెడీ, పాత సినిమాల పేరడీ ఒకసారి చూడొచ్చు. రెండో సారి భరించొచ్చు. కానీ మళ్ళీ
మళ్ళీ చూపిస్తుంటే వాటికోసం రిపీటెడ్ గా ఎగబడే రోజులు కావండయ్యా. యూట్యూబ్ లో బొచ్చెడు కామెడీ షార్ట్
ఫిల్మ్స్ ఉన్నాయ్. టీవీ లో వచ్చే జబర్దస్త్ కీ,  సినిమాలకీ కొంచెం తేడా చూపెట్టండి. అప్ డేట్ అవ్వండి అయ్యోరా..!

"సినిమాని విమర్శించడం కాదు..  నువ్వు తియ్యగలవా..?? అసలు సినిమా గురించి మీకేం తెల్సు?" అని, టికెట్టు
కొనుక్కొని ఆ తర్వాత నెత్తి కొట్టుకొని ఏడ్చే మా లాంటి ప్రేక్షకుల మీద పడకండి. మాకు స్క్రీన్ ప్లే లాంటి పదాలకి
స్పెల్లింగులు కూడా రావు. (అందుకే తెలుగు లో రాశా).
కొత్తగా ఉంటే కధ బాగున్నట్టూ, పాత కధయినా ఆసక్తి గా చూస్తుంటే స్క్రీన్ ప్లే బాగున్నట్టూ, పాటలొచ్చినప్పుడు ,
ఫైట్లొచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉంటే సినిమా సూపరన్నట్టు.

మీ నెక్శ్ట్ సినిమాలు వస్తాయి కదా... ఒంగడు,దాగడు,దగ్గడు, మింగడు,కక్కడు.. మున్నగు టైటిల్స్ తో. మా లాంటి బాధితుల ఆవేదనని అర్ధం చేసుకొనీ వాటిని కొంచెం చూడదగ్గ సినిమాలుగా తీసి వదలాల్సిందిగా వేడుకుంటున్నాను.
"లేదూ... ఆ శీనువైట్ల ఆనందం, వెంకీ సినిమాలకే పరిమితం, ఇప్పుడు స్టార్ డైరెక్టర్నీ.... సరికొత్త శీను ని , పూర్తిగా
మారిపోయాను" అంటారా?
ఇట్టాంటి సినిమాలు ఇంకా తీసి మమ్మల్ని చచ్చేలా చావగొట్టండి. ఆ తర్వాత హృదయకాలేయం, మూత్రపిండాలూ, అరుస్తున్న పేగులు, మెదడు వాపు, లాంటి టైటిల్స్ తో మరిన్ని సినిమాలొచ్చి మీరు ఇత్తడి చేసొదిలేసిన  మా మీద ఇంత మట్టేసి పోతాయి. దరిద్రం వదిలిపోద్ది.

చివరిగా...
ఈ సినిమా లో కొన్ని డవిలాగులున్నాయిగా  కత్తి తో మామిడికాయ కోసినట్టూ.. కస్ కస్ కస్ లాడుతా.... ఆ స్టైల్ లో చెప్పుకుంటే
ఈ సినిమా ఒక Senseless,worthless,time killing,money wasting,torturing,brain damaging,bone breaking,,boring, blunderful,harmful,pathetic,predictable,unbearable,unstoppable, routine,రొట్ట , చచ్చు, పుచ్చు చెత్త సినిమా.

ఇల్లాంటి డైలాగులు మాకు ధియేటర్లో ఎలా వినిపించినియ్యో తెలుసునా??
Senselessworthlesstimekillingmoneywastingbraindamagingbonebreakingtorturingboringblunderfullharmful
patheticpredictableunbearableunstoppableroutineరొట్టచచ్చుపుచ్చుచెత్తసినిమా.


నరేష్ మరియు నేను (మదన్) మొదటి రోజు వెళ్ళిన మహేష్ బాబు మూవీ కుమార్ రాజ  గారి ఆర్థిక సౌజన్యం తో ...

ఇంతే సంగతులు
చిత్తగించవలెను.

జై హింద్.!!!

Thursday 19 June 2014

కృషి వుంటే....

'కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు' అని ఓ సినీ గేయం ఉద్బోధిస్తుంది. బీహార్ కు చెందిన ఆనంద్  కుమార్ ఇదే కోవకు చెందుతాడు.


(శ్రీ ఆనంద్ కుమార్)

అయితే ఇతగాడి గురించి డిస్కవరీ ఛానల్ ఒక గంట  ప్రోగ్రాం ప్రసారం చేసేవరకు, టైం మేగజైన్ ఒక కధనాన్ని ప్రచురించేవరకు, దాన్ని చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా తన ప్రతినిధిని పాట్నా పంపి వివరాలు ఆరాతీసేవరకు ఈ ఆనంద్ కుమార్ ఎవరో బీహార్ బయటి భారత దేశానికి తెలియదు. అదే చిత్రం.
పేరు ఆనంద్ కానీ అతడి జీవితంలో ఆనందం తక్కువే. నిరుపేద కుటుంబం. బాగా చదువుకోవాలనే ఆరాటం. కానీ చదివించలేని కుటుంబ నేపధ్యం.
గణిత శాస్త్ర మేధావి రామానుజం అతడి రోల్ మోడల్. ఒకరకంగా ఆయనకు ఏకలవ్య శిష్యుడు. రామానుజం మాదిరిగా కేంబ్రిడ్జ్ లో చదువుకోవాలనే కోరిక తీరకపోయినా తనలాగా కలలు కనే కటిక పేద విద్యార్ధుల కలలు మాత్రం తన కృషితో నిజం చేసాడు.
కుటుంబానికి వున్న ఒకేవొక్క ఆధారం తండ్రి. ఆయన  హఠాత్తుగా చని పొవడంతో తల్లితో  కలిసి ఆనంద్ బాద్య్హత నెత్తికెత్తుకున్నాడు. ఇల్లిల్లూ తిరిగి తల్లి చేసిచ్చిన అప్పడాలు అమ్మేవాడు. తీరిక దొరికినప్పుడల్లా ఎవరికీ అర్ధం కాని గణిత శాస్త్ర సమస్యలతో కుస్తీ పట్టేవాడు.  కూలీనాలీ  చేసి పొట్టపోసుకునే వారు, ఆటో డ్రైవర్లు తమ పిల్లల్ని లెక్కలు నేర్చుకోవడానికి ఆనంద్ దగ్గరకి పంపేవారు. వాళ్లు ఉడతాభక్తిగా ఇచ్చే డబ్బులే  కుటుంబ పోషణకు అక్కరకువచ్చాయి. ఈ క్రమంలో నిరుపేద  విద్యార్ధి ఒకడు  అతడి వద్దకు వచ్చాడు. ఐ.ఐ.టీ.లో చేరడం అతడి కల. ఆ స్వప్నం సాకారం చేసే బాధ్యత ఆనంద్ తనపై వేసుకున్నాడు. డబ్బు తీసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి శిష్యుడికి పాఠాలు బోధించాడు.  చిత్రంగా అతడు ఎంట్రెన్స్ పాసయి ఐ.ఐ.టీ.లో చేరగలిగాడు. అంతే  తన ప్రతిభ ఏమిటో ఆనంద్ కి తెలిసివచ్చింది. అంతే  కాదు తాను చేయాల్సింది ఏమిటో కూడా అర్ధం అయింది. తనలాగా పెద్ద చదువులు చదవాలనే కోరికలు వుండి తీర్చుకోలేని బీదపిల్లలకు  సాయపడాలని నిర్ణయించుకున్నాడు.
అతడి కల నిజమైంది. అతడ్ని నమ్ముకున్నవాళ్ళ కలలు నిజమయ్యాయి. ఏటా ముప్పైమంది అతిపేద విద్యార్ధులను  ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఐ.ఐ.టీ. ఎంట్రెన్స్ కి పంపేవాడు. ఆ ముప్పైమందీ సెలక్ట్ అయ్యేవాళ్ళు. ఇది తెలిసి విద్యావ్యాపారులు కొందరు  తమతో చేయి కలిపి లాభాలు గడిద్దాం రమ్మన్నారు. కానీ అతడు సుతరామూ అంగీకరించలేదు. కేవలం పేదరికాన్నే కొలమానంగా తీసుకుని ప్రతియేటా పిల్లలకు శిక్షణ ఇస్తూ అఖండ విజయాలు సాధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సాయం తీసుకుంటే యెం జరుగుతుందో అతడికి తెలుసు. అందుకే దాన్ని మృదువుగా తిరస్కరించాడు. టైమ్ పత్రికలో అతడి గురించి చదివిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఏకంగా తన ప్రతినిధినే ఆనంద్  దగ్గరకు పంపి అవసరమైన సాయం చేస్తాననే సంసిద్ధత  వ్యక్తం చేసాడు. కానీ ఆనంద్  ధ్యేయం వేరు. తనలాటి పేదవారిని మరో  నలుగురిని జీవితంలో పైకి తీసుకురావడం తప్ప నలుగురూ  తన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఏనాడు  తాపత్రయ పడలేదు.
ఏటా ముప్పయిమంది అతిపేద పిల్లల్ని ఐ.ఐ.టీ.లో చేర్చడం ఒక్కటే ఈ ఏకలవ్యుడి లక్ష్యం. ఆ ధ్యేయం ముందు అతడికి మిగిలినవన్నీ అత్యల్ప స్వల్ప విషయాలే!
రామానుజం పేరుతొ ఏర్పాటుచేసుకున్న సంస్థలో చదివే పిల్లలకు తల్లి అన్నం వొండి పెడుతుంది. సోదరుడు ఇతరత్రా అవసరమైన  సాయం చేస్తాడు. ఆనంద్ పాఠాలు చెబుతాడు.
అలా వారి జీవితం సాగిపోతోంది. అతడి నుంచి సభ్యసమాజం, ప్రత్యేకించి చిన్నమెత్తు పనిచేసి పెద్దపెట్టున  ప్రచారం పొందాలని  తాపత్రయపడే  వ్యక్తులు, సంస్థలు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం వున్నాయి.

కోటికొక్కడు కళ్యాణ సుందరం

ఈ కళ్యాణ సుందరం గారిని గురించి చదివిన తరువాత జన్మ ధన్యం అనిపించింది. ఇలాటి మంచి వాళ్లు ఇంకా వున్నారు. వాళ్ళ మధ్యనే మనం బతుకుతున్నాం. జన్మ ధన్యం కావడానికి ఇంకేమి కావాలి.
దాత్రుత్వంలో 'శిబి'ని తలపించే కళ్యాణ సుందరం చెన్నైలో ముప్పయ్యేళ్ళ పాటు లైబ్రేరియన్ గా పనిచేశారు. అయితే అందులో ప్రత్యేకత ఏముంది అనిపించవచ్చు. అందరి ఉద్యోగుల మాదిరిగానే నెలనెలా జీతం తీసుకున్నాడు. కానీ ఏనాడు ఒక్క రూపాయి కూడా ఇంటికి పట్టుకుపోలేదు. సంపాదించిన ప్రతి రూపాయి అవసరంలో వున్నవాళ్లకే దానం చేస్తూ వచ్చాడు. చివరికి ముప్పయ్యేళ్లు సర్వీసు చేసిన అనంతరం ముట్టిన పించను మొత్తం పదిలక్షలు దానధర్మాలకే ధారపోశాడు.
మరి ఉదర పోషణ అంటారా. తీరిక సమయాల్లో హోటల్లో సర్వర్ గా పనిచేసి ఆ భత్యంతో పొట్టపోసుకునేవాడు.


మూడో కంటికి తెలియకుండా చేసిన ఈ దానాలు గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి ఈ చెన్నై సుందరాన్ని గుర్తించి శతాబ్దపు ఉత్తమోత్తమ పౌరుడిగా నిర్ణయించి సత్కరించింది. మరో అమెరికన్ సంస్థ 'కోటికొక్కడు' బిరుదు ఇచ్చి, దానితోపాటు అక్షరాలా ముప్పయ్ కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందచేసింది. ఆ చెక్కు అందుకున్న కళ్యాణ సుందరం గారు  తన  అలవాటు ప్రకారం ఆ మొత్తాన్ని అవసరంలో వున్నవారికి సాయపడేందుకు దానం చేసి చేతులు దులిపేసుకున్నారు.
కధ ఇక్కడితో ఆగలేదు. చేతికి ఎముకలేనట్టు దానం చేసే ఈ అభినవ శిబి గురించి మరో గొప్ప వ్యక్తికి తెలిసింది. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఏమిచ్చినా మళ్ళీ దానం చేసేస్తాడు కాబట్టి కల్యాణసుందరం గారిని ఓ మంచి రోజు చూసి తన తండ్రిగా దత్తత తీసేసుకున్నాడు. కళ్యాణ సుందరం గారి  దాన ఫలం  ఆ విధంగా దక్కి రజనీకాంత్ వంటి మహోన్నతుడికి తండ్రి కాగలిగాడు. రజనీకాంత్ సన్ ఆఫ్ కల్యాణ సుందరం అని అనిపించుకోగలిగాడు.
కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా దానాలు చేస్తూ వచ్చిన ఈ కళ్యాణ సుందరం గారికి కళ్యాణ ఘడియ మాత్రం  తోసుకురాలేదు. దానధర్మాలకు అడ్డం అనుకున్నారో యేమో పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగానే వుండిపోయారు.

Friday 6 June 2014

నవ్యాంధ్రప్రదేశ్ :: తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనం



ఒక సమాజం అభివృద్ధి చేసుకున్న కళలుసాహిత్యంజీవన వైవిధ్యంనైతిక విలువలుఆచారాలునమ్మకాలతో పాటుదాని ఆధ్యాత్మికతభౌతికతమేథ మరియూ భావోద్వేగాల రూపమే సంస్కృతిసీమాంధ్ర ప్రాంతాల్లో రూపు దిద్దుకున్న భాషా సంస్కృతులు తెలుగు వారందరినీ భాషాజాతీయులుగా ఒక్కటి చేస్తూ వచ్చాయి.

క్రీ.పూ.1000 నాటికే ద్రావిడులుఆంధ్రులునాగులు, యక్షులు, గరుడులు, తమిఝులు ఇలాంటి ప్రజలు స౦లీనమైభాషా స౦పన్నమైన ఒక నాగరిక జాతిగా ఎదిగారని యేటుకూరి బలరామమూర్తి ప్రభృతులు ప్రకటించారునాగులకు కృష్ణాజిల్లా మోపిదేవి, యక్షులకు గుంటూరుజిల్లా భట్టిప్రోలు, గరుడులకు కృష్ణాజిల్లా గుడివాడ(గృధ్రవాడ) కేంద్రాలుగా ఉండేవి. కొన్ని ద్రావిడగణాలు ఆఫ్రికన్ నైలూ తీర౦ ను౦చీఆంధ్రగణాలు యమునా తీర౦ ను౦చీ వచ్చి, వీరితో సంలీనమయ్యాయి. మౌర్యుల తర్వాత విదేశీ దాడులు ఎక్కువ కావడంతో ఉత్తరాదినుండి ఆర్యుల వలసలు కూడా అనివార్యం అయ్యాయని పద్మినీసేన్‘గుప్తా పేర్కొన్నారు. వీరందరి మధ్యా  సంఘర్షణలు, సంలీనాల వలన ఆంధ్రభాష, ఆంధ్ర సంస్కృతులు కొత్త రూపాలు తొడిగాయి. సంఘర్షణలు కాదు, సంలీనాలే ఆంధ్రుల భాషా సంస్కృతులను నిర్మించాయి.
పుట్టలో పాలు 
పోయట౦పుట్టమన్ను చెవులకు అ౦టి౦చుకోవట౦నాగమ్మనాగయ్యనాగేశ్వర లా౦టి పేర్లు,పాము+పర్రు=పా౦బర్రు =పామర్రు లా౦టి గ్రామనామాలుఇవన్నీ 3,000 ఏళ్ళనాటి ఆంధ్రనాగుల ప్రభావానేఅలవడ్డాయి. బుద్ధుడికి గొడుగుపట్టిన ముచిలి౦దనాగు ఆంధ్రుడేఏడు తలల పాము నీడపడ్తున్న నాగార్జున కొండ బుద్ధ విగ్రహమే సాక్ష్యం.
గేదెలు ఎక్కువగా పెరిగే నేల కాబట్టి, 

ఆర్యులు  ప్రాంతాన్నిమాహిష (గేదెమండలం అన్నారురోమన్లు మైసోలియా’అన్నారుగేదెబర్రె తొలి నాటి తెలుగు పదాలుమధ్యద్రావిడ మూల రూపాల్లో(Central proto Dravidian) “గేదె”,దక్షిణ ద్రావిడ మూలరూపాల్లో (southern proto Dravidian) ఎనుముఎరుము అనే పేర్లు కనిపిస్తాయిగేదెలకున్న ఎరుము(నల్లనిది)’ పేరుని బట్టి తూర్పు కనుమలను ఎర్రమల (ఎర్రకొ౦డ) అన్నారుఎనమదల (ఎనుముతల),ఎనమ౦దుల ఊళ్ళ పేర్లు ఏర్పడ్డాయిఎర్రయ్యఎర్రాప్రగ్గడ పేర్లతో వ్యక్తులు ప్రసిద్ధి చె౦దారుయెర్నేని లా౦టి ఇంటిపేర్లుకూడా ఇలానే వచ్చాయని ఆచార్య సు౦దరరామశాస్త్రి (The history of Krishna District in the Ancient and middle ages) వ్రాశారుపెద్ద మూపుర౦ కలిగిన ఒంగోలు జాతి ఎద్దులూ  రోజుల్లో మనకుండేవిఅమరావతిమ్యూజియంలోని పెద్ద మూపుర౦ ఎద్దు శిల్ప౦ ఇందుకు సాక్ష్య౦.
క్రీ.పూ.2,500 నాటికే కృష్ణా గోదావరి ముఖ ద్వారాల నుండి ఆఫ్రికన్ గణాలు కొన్ని ఆంధ్రప్రాంతానికి చేరి రాజ్యాన్ని స్థాపించు కున్నాయని, 

ఇది దక్షిణ భారత దేశపు కొత్త రాతియుగ స౦స్కృతికి ప్రార౦భ౦ అనీప్రా౦క్లిన్ సి సౌత్ వర్త్పేర్కొన్నారు. గుల్బర్గాబళ్ళారికర్నూలురాయచూరుల్లో కూడా పురావస్తు ఆధారాలున్నా యన్నారు. (Professor Emeritus of South
Asian Linguistics, Pennsylvania,  First Historian, identified the earliest presence of proto Dravidian Culture.)
బహుశాఈ ఆఫ్రికన్ గణాలే తొలి ద్రావిడులు కావచ్చనేది తాజా పరిశోధనాంశంఆఫ్రో ఏసియాటిక్ మూలభాషా రూపాలలో అనేక ద్రావిడ పదాలు కనిపించటంతో లింగ్విష్టిక్ ఆర్కియాలజీ అనే కొత్త పరిశోధనాంగం ఈ పరిశీలనలు చేస్తోంది ఈ తొలిద్రావిడులు శవాన్ని పాతిపెట్టిమూడు పెద్దరాళ్ళు తెచ్చి పొయ్యిగూడు’ ఆకార౦లో నిలిపి,కైరన్లు(సమాధులు) కట్టారు.
వీటి కోస౦ పొడవైన పెద్ద రాళ్ళను వాడటం వలన  యుగాన్ని పెద్ద రాతియుగ౦ (బృహత్ శిలాయుగ౦) అన్నారు.స్థానిక౦గా
 సమాధుల్ని రాక్షస గుళ్ళువీరగుళ్ళువీరకల్లులని కూడా పిలిచారువీరవాసర౦వీరులపాడువీరవల్లి ఊళ్ళ పేర్లువీటి వలనే ఏర్పడ్డాయని శ్రీ వి వి కృష్ణశాస్త్రి లోహయుగ స౦స్కృతి’ వ్యాస౦లో పేర్కొన్నారుపెద్దది అనటానికి రాక్షసఅన్నారు. కొన్ని రాతిఫలకాల మీద దిచ్చుచెరువుశ్రీ” “రతివిలాసశ్రీ’ పేర్లు బ్రాహ్మీలిపిలో కనిపి౦చాయిదిచ్చు, దిచ్చరిఅంటే వ్యభిచారి.
క్రీ.పూ. 500 వరకూ తూర్కకొట్టిచాతఏలఎహువలకాట్టు, బెజ ఇలా౦టి దేవతల ఆరాధన తెలుగునేల మీదజరిగేదిబెజ’ ప్రజలు కొలిచిన బెజదేవత’ పేరున బెజవాడ ఏర్పడి ఉ౦డవచ్చుబెజ’ ప్రజలు ఈనాటికీ సుడాన్,ఈజిప్ట్లలో ఉన్నారుబెజబెజావి లేదా బెదావి వీళ్ళ భాష!  నైలూ ను౦డి వచ్చిన తొలి ద్రావిడ ప్రజల్లో  బెజప్రజలుఒకరు కావచ్చు.

 “అఖిలా౦ధ్రావనికి తొలిరాజధాని శ్రీకాకుళ౦” అనే వ్యాస౦(1930)లో  కా’ ప్రజలు కృష్ణా ముఖద్వార౦ దగ్గర కాకుళాన్ని(కృష్ణాజిల్లా శ్రీకాకుళంనిర్మించుకుని పాలి౦చారని శ్రీ టేకుమళ్ల రామచ౦ద్రరావు ప్రతిపాదించారుకా’ అనే రాజవ౦శ౦ఈజప్టుని ఏలింది. 1902లో అక్కడ తొలి కా’ రాజుగారి సమాధి దొరికిందిఈ ‘కా’ ప్రజలు కృష్ణా ముఖద్వారం గుండాదివిసీమలోకి అడుగు పెట్టి కాకుళ రాజ్య౦ నెలకొల్పారుకాకులేశ్వరుడి ఆరాధకులయ్యారుకా’ అంటే ఈజిప్షియన్లభాషలో ఆత్మ! చక్రవర్తి (ఫారోమరణిస్తే, ఆయన ఆత్మ స౦తృప్తి చెందినప్పుడు మరణాన౦తర భాధ్యతల్ని నెరవేర్చగలుగుతాడని ఆయనకు ఇష్టమైన ఆహార పానీయాలు సమాధుల్లో ఉంచేవారుతద్దిన౦ పెట్టే అలవాటు  కా’ ప్రజల ను౦డే స౦క్రమి౦చి ఉ౦డవచ్చు. కాకుల్ని ఈజిప్షియన్లు కూడా పిత్రుదేవతలు గానే (harbingers) భావించారు.
కాకుల అంటేకా+కుల౦=నలుపు+నదికృష్ణానదినైజీరియాలో “Ka River” ఉ౦దినైగర్ నదిలో  కా’ నదికలుస్తు౦దిaf-rui-ka ఆఫ్రికా’ పేరులో “Ka” అంటే గర్బాశయ౦పుట్టిల్లు అని (Ref: Nile Genesis: the opus of Gerald Massey). ప్రాచీన ఈజిప్ట్లో ‘El Kurru’ అనే నగర౦ ఉ౦డేదికృష్ణాజిల్లాలో ఎలకుర్రు అనే కుగ్రామ౦ ఉండటంకాకతాళీయ౦ కాదుఎల్లకర్రు అనే ఊరు నెల్లూరు జిల్లాలో కూడా ఉ౦దిఅక్కడ రాతి యుగ౦ నాటి అనేక ఆధారాలుదొరికాయి. రాయలసీమ లోనూ, బళ్ళారిలో కూడా ఇలాంటి ఆధారాలు అనేకం కన్పిస్తాయి. ఇక్కడినుండి బయల్దేరిన ద్రావిడ గణాలు కొంకణి, గుజరాతు మీదుగా సింధునగరాలకు చేరి, ఆ నాగరికతలో ముఖ్య పాత్ర పోషించారన్నది సౌత్వర్త్ గారి పరిశోధన.
కౌ౦డిన్య సుచ౦ద్రుడి కొడుకు ఆంధ్రవిష్ణువనే రాజు కా’ రాజ్యాన్ని ఏలే నిశు౦భుణ్ణి ఓడించాడు. ఆంధ్రసామ్రాజ్యంనెలకొల్పాడుప్రజలు ఆంధ్రవిష్ణువుని ఆరాధించ సాగారు. నిరీశ్వరా పరేదేశాః ఆంధ్రః ఏకోస్తి సేశ్వరఃయత్రాస్తే భగవాన్విష్ణుః ఆంధ్రనాయక స౦ఙ్ఞయా-దేశ పరమైన దేవుడు ఒక్క ఆంధ్ర దేశానికే ఉన్నాడుఆయన ఆంధ్రభాషా దేవుడైనఆంధ్రవిష్ణువు. ఆంధ్రనాయకుడుతెలుగు రాయడు అని ఆయనకు పేర్లున్నాయి... అని కీర్తించుకున్నారు. 

స౦కిచ్చజాతక౦, ఘటజాతక౦ అనే బౌద్ధ జాతక కథలలో అ౦ధకవెణ్ణు పేరుతో ఆంధ్రవిష్ణువు గురించి ఉందిబుద్ధుడువసుదేవుడు (కృష్ణుడు)గా పుట్టిద్వారకా నగరానికి కావలిగా ఉన్న ఒక గొప్ప గాడిద కాళ్ళు  పట్టుకుని మచ్చికచేసుకొనిదాని సాయంతో ద్వారకను బంధించాడట. వసుదేవు డ౦తటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడనే తెలుగుసామెత ఇలా వచ్చిందే!
 “శ్రీశైల భీమ కాలేశ మహే౦ద్రగిరి స౦యుతమ్/ప్రాకార౦తు మహత్ కృత్వాత్రీణి ద్వారాణి చా~కరోతి” మహే౦ద్రగిరి,భీమేశ్వర౦, శ్రీకాకుళం  మూడి౦టినీ హద్దులుగా మూడు ద్వారాలుగా చేసుకొని త్రిలి౦గదేశాన్ని ఆంధ్రవిష్ణువుపాలి౦చాడుఆ కాలంలోనే తొలి ఆంధ్ర వ్యాకరణ గ్ర౦థ౦ కాణ్వ వ్యాకరణం’ వచ్చినట్టు ఆచార్య అమరేశ౦ రాజేశ్వరశర్మపేర్కొన్నారు.
బౌద్ధయుగ౦లో కృష్ణానది ఇరుగట్ల వె౦బడి విస్తరి౦చిన ప్రా౦తాన్ని అంథపథ (ఆంధ్ర రాజ్యానికి దారి) అన్నారుధన్నకాడ(ధాన్యకటక=అమరావతిదీని రాజధానిఆంధ్రకాః కృష్ణా గోదావర్యో ర్మధ్యే విద్యమాన దేశః -కృష్ణాగోదావరి మధ్య ప్రదేశం ఆంధ్ర రాజ్యం”” అని మహాభారతంలో వివరణ ఉంది.  గాసట బీసట గాథలు (గాథాసప్తశతి, బృహత్కథ) పుట్టిన కాలం అది! ఆంధ్రుల తొలి రాజధానిగా శ్రీ కాకుళం, మలి రాజధానిగా ధనకటకం(గుంటూరుజిల్లా అమరావతి) ప్రసిద్ధిపొందాయి.
బౌద్ధయుగంలో ఇక్ష్వాకుల కాలం వరకూ తెలుగు నేలమీద పాళీభాష వ్యాప్తిలో ఉండేది. అంకెఆకట్టు,ఆగు ఆపు,కసవు(మురికి)గరిసె- మానిక(కొలతపాత్రలు)కంచెగొడ్డలి, పలుగుకళ్ళంచెత్త లాంటి తెలుగు వ్యవసాయ పదాలుపాళీ భాషలోకి చేరాయిఇక్ష్వాకుల పాలన అ౦తరి౦చిన తరువాత క్రీ. శ.4,5 శతాబ్దాల కాల౦లో బౌద్ధానికి కష్టకాల౦ దాపురి౦చి౦ది. వైదిక ధర్మ పునరుద్ధరణకు శాల౦కాయనులువిష్ణుకు౦డినులుపల్లవులు పూనుకున్నారు. వీరి వలన స౦స్కృత భాష ఆధిపత్య౦ పెరిగి. పాళీ ప్రాకృతాలు కనుమరుగయ్యాయి. పైశాచి భాష తెలుగు భాషకు దగ్గరగా ఉండేదని అంటారు. కానీ, అది అ౦టరాని దయ్యి౦ది. ప్రజల భాష మీద స౦స్కృతం పెత్తన౦ చేసి౦ది.


బుద్ధుడుమహావీరుడు రాజ్యత్యాగాలు చేసి తమ వ్యక్తిత్వాలతో ప్రజల్ని ఆకర్షి౦చారు. ఙ్ఞానవ౦తు లైన బౌద్ధుల్ని, బౌద్ధ స౦ఘాల్ని, బౌద్ధధర్మాన్ని ఆశ్రయించవలసిందిగా బౌద్ధులు ప్రబోధి౦చారు. ధర్మాన్ని పోతపోస్తే రాముడి విగ్రహంలా ఉ౦టు౦దని, పదునాలుగేళ్ళ పాటు రాముడు రాజ్యత్యాగం చేసి దుష్ట శిక్షణ చేశాడని వైదికులు కూడా ప్రచారం చేశారు. శివుడైనా విష్ణువైనా ఒకడే ననే మధ్యేమార్గాన్ని స్మార్తులు అనుసరి౦చారు. వైదిక౦లోకి జన౦ తరలి రావాల౦టే ఈ మధ్యే మార్గ౦ తప్పనిసరి అయ్యి౦ది. ఆంధ్రుల్లోఈ నాటికి స్మార్తులే ఎక్కువ. బౌద్ధ౦ లో౦చి వలసల్ని ఆకర్షి౦చటానికి దశావతారాల్లో ఒకరిగా బుద్ధుని అ౦గీకరి౦చారు కూడా! కానీబౌద్ధారామాన్ని విష్ణ్వాలయ౦గా ఎవరూ స్వీకరించలేదు. వైదిక యుగంలో సంక్రమించిన కుల, వర్ణ వ్యవస్థను వీర శైవులు, వీర వైష్ణవులు రూపు మాపే ప్రయత్నాలు చేశారు.

వేంగి చక్రవర్తుల్లో తూర్పు చాళుక్య కుబ్జవిష్ణువర్థనుడు తెలుగుని పాలనా భాష చేశాడు. గుణగ విజయాదిత్యుడు, అతని సేనాని పండరంగడు తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. సాహితీ సమరాంగణ సార్వభౌములుగా మొదట చెప్పవలసింది వీళ్ళిద్దర్నే! పండరంగడి అద్దంకి శాసనం తరువోజ చందస్సులో భాషా చరిత్రకు కీలకం అయ్యింది.
12వశతాబ్దిలో కాకతీయులు తెలుగుజాతిని ఏకం చేయటంలో ఆంధ్రప్రాంత ప్రజలు అందించిన సహకారం గొప్పది.
దివిసీమ యువరాజు జాయపసేనాని చీరాల పాలకుడిగా సంగీత నృత్య కళలలో తెలుగుదనాన్ని పరిమళింప చేశాడు.. ఆంధ్రనాట్య రీతుల్ని ప్రామాణీకరించాడు. దేశి, మార్గ రూపాలను నిర్దేశించాడు. క్రీ.శ.1368లో కాకతీయ ప్రభువులు బందీ లైనప్పుడు ముసునూరి ప్రోలయ, కాపయ సోదరుల నాయకత్వంలో ఆంధ్ర సామంత రాజులు ఏకమై సుల్తాన్లను ఎదిరించి, కాకతీయ రాజ్యాన్ని నలబై ఏళ్ళపాటు నిలబెట్టారు. పరాయి పాలనను వ్యతిరేకిస్తూ ఆంధ్రుల తొలి స్వాతంత్ర్య పోరాటం ఇది.
ఆ తరువాత కొండవీటి రెడ్డి రాజ్యంలో అద్భుత సాహిత్య సృష్టి జరిగింది. తెలుగు భాషకు కావ్య గౌరవం స్థిరపడింది. విజయనగర ప్రభువులు నేరుగా కోస్తాజిల్లాల్ని పాలించనప్పటికీ, సాహితీ సంస్కృతుల విషయంలో వారి ప్రభావం మన మీద ఎక్కువగా ప్రసరించింది.

తన ఆముక్తమాల్యదలో ఏడు బాసలాడగల కృష్ణదేవరాయలు, తెలుగదేల? అని అడిగి, దేశంబు తెలుగేనుఅని జవాబు చెప్పాడు. అన్ని భాషల్లోనూ తెలుగు ఒకండ’ అంటే ఏకైక మైనది, ప్రత్యేకమైనది అన్నాడు. రాజులంతా తెలుగును గౌరవిస్తా రన్నాడు. అలాంటి ఆంధ్రభాషలో కావ్య రచన నీకు అసాధ్యమైనదా? అని ఆంధ్ర విష్ణువు తనని నిలదీశాడని చెప్పుకున్నాడు. ఈ అవతారికని ఆంధ్రుల తొలిరాజధాని శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణు సన్నిధిలోనే వ్రాశాడు.
కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించినప్పటికీ, విశాఖ నుండి గుంటూరుజిల్లా వరకూ ఓఢ్ర(ఒరిస్సా) గజపతులకే తిరిగి ఇచ్చేశాడు. గజపతులు ఎక్కువకాలం ఆంధ్రుల్ని పాలించినా, తెలుగు భాషా సంస్కృతుల మీద ఒరియా ప్రభావం పడకపోవటానికి బలమైన విజయనగర ముద్ర ఉండటమే కారణం.
గజపతుల్ని బహమనీ సుల్తాన్లు ఓడించటంతో మొత్తం సీమాంధ్ర మహమ్మదీయ పాలనలోకి చేరిపోయింది. తెలుగు భాషా సంస్కృతులు పూర్తిగా అడుగంటిన పరిస్థితి నడిచింది. అదే సమయంలో మధురని, తంజావూరునీ  నాయక రాజులు పాలిస్తూ భాషా సాహిత్య వికాసాల కోసం పోటీలు పడ్డారు. ఆంధ్రత్వం, ఆంధ్రభాషలు ఎన్నో జన్మల తపఃఫలమని అప్పయ్య దీక్షితులు అన్నాడు. కానీ, అదే కాలంలో నిజానికి ఆంధ్రలో ఆంధ్రత్వం అల్పం అయిపోయి ఉంది. 

1512లో కులీ కుతుబ్షా స్వతంత్రం ప్రకటించుకుని గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్ర ప్రాంతం గోల్కొండకు సుదూరం అయ్యింది. కొద్దిమందికి తప్ప రాజాదరణ దక్కలేదు. దాంతో మధుర, తంజావూరులకు సాహితీ సాంస్కృతిక రంగాల వలసలు పెరిగాయి. చిత్తూరుజిల్లా చంద్రగిరిలో నామమాత్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యాన్ని గోల్కొండ చప్పరించేసింది. దాంతో, సీమాంధ్రల్లో ఆంధ్రపాలకుడే లేని స్థితి నడిచింది. ఆంధ్ర భాషా సంస్కృతులు అనాథలయ్యాయి. కృష్ణలీలా తరంగాలు, క్షేత్రయ్య పదాలు, సిద్ధేంద్రయోగి కృతులు గోల్కొండ పాలనలో మినుకుమినుకు మన్న కొన్ని సాహిత్య రూపాలు. తెలుగువారి నాట్య కళారీతి కూచిపూడి పురుడు పోసుకున్న కాలం అది! కానీ, ఆ కాలంలో నశించిపోయిన సాంస్కృతిక సంపదే ఎక్కువ. మధుర, తంజావూరులు కాపాడి ఉండకపోతే మనకు శూన్యమే మిగిలి ఉండేది..
బ్రిటిష్ యుగంలో రఘుపతి వెంకట రత్నం నాయుడు, వీరేశలింగం ప్రభృతులు సంస్కరణోద్యమాలు సీమాంధ్రను పరివర్తన దిశగా నడిపాయి. కొమర్రాజు వారి విఙ్ఞాన సర్వస్వాలు, గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా సాగిన ఆంధ్రోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవోద్యమాలు, స్వాతత్ర్యోద్యమం ఆంధ్రుల అభ్యుదయానికి తార్కాణాలయ్యాయి. దేశంలో అందరికన్నా ముందే అభ్యుదయ సాహిత్యోద్యమానికి బీజాలు వేశారు తెలుగు కవులు.
నేటి పరిస్థితుల్లో తెలుగుని ఇంటి భాషగానూ, బడి భాషగానూ, ఏలుబడి భాషగానూ చేసేందుకు ప్రజల గుండె తలుపులు తడుతూ, తెలుగు భాషోద్యమం కొనసాగుతోంది. మేథావులెందరో కలిసి చేసిన పోరాటం వలన తెలుగు భాషకు ప్రాచీనతా హోదా వచ్చింది. కానీ, అది పుష్పించని, ఫలించని అలంకార వృక్షంగా మారి, చివరికి ఒక ప్రహసనం అయ్యింది.
రాష్ట్ర విభజన గోరుచుట్టు మీద రోకటి పోటయ్యింది. సీమాంధ్రులు వంచించ బడ్డారనే భావన సర్వత్రా నెలకొంది.

భాషా సంస్కృతుల పునరుజ్జీవనోద్యమానికి నడుం బిగించటమే నేటి అవసరం. గతమెంతో ఘనకీర్తి గలవాడు, నేటి చీకట్లోంచి రేపటి సూర్యుణ్ణి పుట్టించ గలడు!!