Thursday 16 April 2015

HEALTH TIPS FOR VISITING A TEMPLE





ప్రతి మనిషిలో లక్ష్యాలు..కోరికలు ఎన్నో ఉంటాయి. అంతరంగాల్లో ఏదో అలజడి, అసూయ, ద్వేషాలనే గోడలు ఆత్మీయ అనురాగాలను దూరం చేస్తాయి. మానవీయ నైతిక విలువలు మరుగునపడి శారీరక, మానసిక రుగ్మతలు అశాంతులతో అల్లాడుతాయి. ఆ పరిస్థితుల్లో దైవానుగ్రహం కాంక్షించడం మానవ సహజం. ఈ సందర్భాల్లో గుడ్డిగా ఏ దొంగస్వాములను, అవగాహనా రహిత వ్యక్తులను ఆశ్రయించడం కంటే దేవాలాయాలకు వెళ్లడం మంచిది. అంతేకాదు మనం, మన ఆలయ అంతరాల్లో ఏముందో తెలుసుకోవడం సరైన ఆలోచన. ఎందుకంటే..దేహం ఒక దేవాలయం అని నమ్మిన హైందవ జాతి మనది. దేహం పరిశుభ్రంగా ఉంటేనే జీవుడు శక్తివంతంగా ఉంటాడు. అదేవిధంగా దేవాలయం శుభ్రంగా ఉంటే భగవంతుని శక్తి కూడా అపారంగా ఉంటుంది. ఈ రెండు కలిసిన శక్తి మంత్రం జాతికి జీవనం సౌభాగ్యవంతంగా విరాజిల్లుతోంది. అందుకే వేదకాలంలో దేవాలయాలు ప్రతిష్ఠించి వాటిని సమైక్య సాంస్కృతిక, దైవశక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దారు. అలా ప్రజల జీవనం దేవాలయాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది. చతుర్విద పురుషార్ధాల జ్ఞానాన్ని దేవాలయాలే ప్రసాదిస్తున్నాయని పండితులు ఘోషిస్తున్నారు. ఎక్కడైతే దేవాలయాల్లో పరిశుభ్రంగా ఉండి దేవదేవుళ్లు నిత్యపూజలు అందుకుంటారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెబుతారు. అంతేకాదు నిగూఢంగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు మన దేవాలయాలు- పూజా విధానాల్లో దాగివున్నాయి...
శక్తి తరంగాలు
ఆలయ ప్రాంగణాల్లో భక్తులు చేసే జే గంటల నాధధ్వని తరంగాల రూపంలో మనలో నిద్రణాశక్తిని జాగృతం చేస్తాయి. వినసొంపుగా మోగే గుడి గంటల సవ్వడి అంతరంగాల్లో ఉండిపోయిన చైతన్యాన్ని , ఉత్సాహాన్ని కదిలిస్తాయి.
మానసిక ఆందోళన దూరం
ఆలయాలపై ఉండే వాస్తూ, ఆగమపరమైన శిల్పాలు, వేదమంత్రోచ్ఛరణాలు, ఏళ్ల నాటి రాతి కట్టడాల నుండి వెలువడే ధ్వని తరంగాలు నూతన ప్రకంపనలు చేస్తాయి. అక్కడకు వచ్చే భక్తుల మానసిక ఆందోళనలను తొలగించి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
మెరుగైన శ్వాసక్రియకు..
మన ఆలయాలు సాధారణంగా నదీతీరంలో, పుష్కరిణులు కలిగి రావిచెట్టు, వేపచెట్టు, మారెడు, ఉసిరిక, తులసి వంటి ఔషధ గుణాల వృక్షాలతో కొలువై ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రాణవాయువు అధిక శాతం లభించి శ్వాసక్రియ మెరుగుపడుతోంది. నిత్యం శ్రమతో అలసిన వారు, చిరాకు ఉండేవారు ఆలయాల దర్శనానికి వెళ్లి ఆవాసంలో అరగంటసేపు ఉంటే ఎంతో ఉపశమనం చేకూరుతుంది.
ఏకాగ్రత పెరుగుతుంది
ఆలయాలకు ధ్వజస్తంభం వెనె్నముక కాగా, ఆలయ శిఖరం సహస్రారం వంటిది. దేవతామూర్తి స్థానం హృదయస్థానం. నిరాకారుడైన భగవంతుని సాకార రూపంలో దర్శనం చేసుకుంటే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాల సారాంశం. ఆలయాల్లో యజ్ఞయాగాది క్రతువులు వేదమంత్రోచ్ఛరణలతో భక్తులకు ఏకాగ్రత పెరుగుతుంది.
నయనాలు కాంతిమయం
మన ఆలయాల్లో నెయ్యి, నువ్వులనూనెతో వెలిగించే దీపాలు నేత్రదోషాలను నివారిస్తాయి. తులం ఆవు నెయ్యి దీపారాధనతో టన్ను ఆక్సిజన్ వెలువడుతుందని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. దీపం కొండెక్కిన తరువాత వచ్చే ఆవిర్లతో హృదయ సంబంధ వ్యాధులు నయమవుతాయని పురోహితులు చెబుతారు.
వ్యాధులు దరిచేరవు..
ఆలయాల చుట్టూ భక్తులు ప్రదక్షణలు చేయడం , సాష్టాంగ నమస్కారాలు, సూర్యనమస్కారాలు చేయడం నేటి ఆధునిక వ్యాయామాలకు, యోగాకు పురాతన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ ప్రక్రియలతో ఆరోగ్యపరమైన విశేషాంశాలతో పాటు కీళ్ల సంబంధ వ్యాదులు దూరమవుతాయి. అంగ ప్రదక్షణలు చేయడం ద్వారా చర్మ సంబంధ రోగాలు దరిచేరవు.
తీర్ధం..పరమార్ధం
ఆలయాల్లో దేవతామూర్తులకు బిల్వదళం, తులసి దళం, నారికేళం, పంచామృతాలతో అభిషేకించిన తీర్ధం భక్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్య తీర్ధం, అకాల మరణ హరణం.., సర్వ వ్యాధి నివారణం.., సమస్త పాపక్షయకరం స్వామి పాదోదకం అంటారు.
ప్రసాదం..్ఫలితం
చక్రపొంగలి, దద్దోజనంలో మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, పెసర పప్పుతో చేసే ఇతర ప్రసాదాలతో జీర్ణశక్తి పెరుగుతుంది. ఆలయంలో ప్రసాదం అందరూ కళ్లకు అద్దుకొని స్వీకరించడం వెనుక శాస్తప్రరమైన రహస్యమిదే.
కాబట్టి ఆలయాల దర్శనాలు, ఆచరించే ఆచారాలు, చేసే పూజల్లో దేహానికి ఎంతో మేలు చేస్తాయని అర్ధమవుతోంది.

ఇష్థ కామేశ్వరి దేవి - శ్రీశైలం




ఇష్థ కామేశ్వరి దేవి - శ్రీశైలం

తిరుమల తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం, అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునే వారు. ఈ రోజున వివిధ దేశాలను భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు.
మల్లన్న నిలయమైన శ్రీ శైలం ... సిద్ధ క్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అరణ్యంలో కనిపిస్తూ వుంటాయి. అలాగే ప్రాచీనకాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా 'ఇష్టకామేశ్వరీ ఆలయం' దర్శనమిస్తోంది.
పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న 'ఇష్టకామేశ్వరీ దేవి' ... నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి వుంటుంది. పక్షుల కిలకిలలు ... జంతువుల అరుపులు ... జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుంది.
ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి వుంటుంది. రెండు చేతులలో తామర పుష్పాలను ... మిగతా రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి వుంటుంది. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇదే విషయం 'ఇష్ట కామేశ్వరీ వ్రతం' లోను కనిపిస్తుంది.
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...

Wednesday 15 April 2015

LOST YOUR MOBILE ?



దయచేసి చదవండి.........షేర్ చేయండి.........ఇది అందరికీ తెలిసిన విషయమే
కానీ ఇంకా చాలామందికి తెలియక వారి మొబైల్స్ పోగొట్టుకుని బాధపడుతునే ఉన్నారు............ఇలా చేసి చూడండి........మీ మొబైల్ దొరికే అవకాశం ఉంది.........

1.*# 06 # నెంబరుకు డయల్ చేయండి........

2.15 నెంబర్లతో మీ పోనుకు మెసేజ్ వస్తుంది........దాన్ని మీ మొబైల్ లో కాకుండా ఎక్కడైనా రాసి ఉంచుకోండి........

3.మీ మొబైల్ పోయిన వెంటనే : cop@vsnl.net కు ఆ 15 నెంబర్లను మైల్ ద్వారా పంపండి.......

4. పోలీసులకు తెలుపవలసిన అవసరం లేదు......

5.24 గంటలలోపు GPRS or net ద్వారా మీ మొబైల్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయవచ్చు........

6.మీ నెంబరుని మార్చినా ఆ ఫోను ఎక్కడ వుందో....ఏ ఏరియాలో ఉందో తెలుసుకోవచ్చు......

7.దీనికి మీరు చేయవసినదంతా.....
మీ పేరు:
చిరునామా:
ఫోను మాడల్....
చివరిసారిగా డయల్ చేసిం నెంబరు....
మీ mail id.
మీ ఫోను పోయిన తేది:
IMEI నెంబరు.

ఈ వివరాలను cop@vsnl.net కు పంపండి.......అంతే మీ మొబైల్ దొరికే అవకాశాలు ఉన్నాయి